Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వ్యక్తికి రెండుసార్లు కరోనా.. విశాఖలో జడుసుకుంటున్న జనం

Webdunia
మంగళవారం, 19 మే 2020 (13:38 IST)
కరోనా కేసులు దేశంలో లక్షను దాటాయి. అలాంటి మహమ్మారి కరోనాతో పోరాటం చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అలాంటిది ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి కరోనా వస్తే ఎలా వుంటుంది. ఒకే వ్యక్తికి రెండోసారి కరోనా వస్తే అతని పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఘటనే విశాఖలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. విశాఖలోని ఓ కుటుంబంలో ఓ వ్యక్తికి రెండోసారి కరోనా సోకింది. విశాఖలో ఓ కుటుంబంలో 8 మంది నివసిస్తుంటారు. వీరిలో మొదట ముంబై నుంచి వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి మొదట కరోనా సోకింది. ఏప్రిల్ 1 వ తేదీన కరోనా సోకింది.
 
కాగా, కరోనాకు ట్రీట్మెంట్ తీసుకోవడంతో నయం అయ్యి ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఇంట్లో అందరికి కరోనా సోకింది. ఆ తరువాత మరలా మొదట కరోనా సోకిన వ్యక్తికి తిరిగి కరోనా రావడంతో వైద్య సిబ్బంది షాక్ అయ్యారు.
 
ఒకేసారి వచ్చిన వ్యక్తిలో వైరస్‌ను అడ్డుకోగలిగే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయని, అవి కరోనాను ఎటాక్ చేసే శక్తిని కలిగి ఉంటాయని వైద్యులు చెప్తుండగా, కరోనా ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజులకే తిరిగి రెండోసారి కరోనా సోకడంతో వైద్యులతోపాటు అటు వైజాగ్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments