Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ డే... ద‌ళితుల‌పై పాము ప‌గ ప‌ట్టారు బాబు: ఎంపీ నందిగం

Webdunia
శనివారం, 31 జులై 2021 (19:26 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ రోజు బ్లాక్ డే అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టార‌ని అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతో ఇలా దాడులు చేయిస్తున్నార‌ని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని, నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే అని చెప్పారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ వంటి వారిని చంద్ర‌బాబు పరామర్శించడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. 
 
నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడ‌న్నారు. ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు...ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్య‌బ‌ట్టారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గొల్ల‌పూడికి వెళ్ళిన చంద్రబాబును అడ్డుకునేందుకు ద‌ళిత వ‌ర్గాలు అక్క‌డ ప్ర‌య‌త్నించాయి. అయితే, భారీ పోలీసు బందోబ‌స్తు వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఈ చ‌ర్య స‌రికాద‌ని, చంద్ర‌బాబు ద‌ళితుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఎంపీ నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments