Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ డే... ద‌ళితుల‌పై పాము ప‌గ ప‌ట్టారు బాబు: ఎంపీ నందిగం

Webdunia
శనివారం, 31 జులై 2021 (19:26 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ రోజు బ్లాక్ డే అని వైసీపీ ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. పాము పగబట్టినట్లు చంద్రబాబు దళితులపై పగబట్టార‌ని అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించారనే కక్షతో ఇలా దాడులు చేయిస్తున్నార‌ని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని, నిజంగా ఈ రోజు ఒక బ్లాక్ డే అని చెప్పారు. దళితులపై దాడి చేసిన దేవినేని ఉమ వంటి వారిని చంద్ర‌బాబు పరామర్శించడం ఏమిటి? అని ప్ర‌శ్నించారు. 
 
నిజాయితీ రాజకీయాలు చేయాలంటే దళితుల వెనుక నిలవాలి కానీ చంద్రబాబు మాత్రం తన నైజాన్ని ఎన్నటికీ మార్చుకోడ‌న్నారు. ఇంక ఎన్ని ఎన్నికలు వచ్చినా దళితులు, బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఈయన్ని నమ్మరు...ప్రతి వర్గానికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్య‌బ‌ట్టారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు గొల్ల‌పూడికి వెళ్ళిన చంద్రబాబును అడ్డుకునేందుకు ద‌ళిత వ‌ర్గాలు అక్క‌డ ప్ర‌య‌త్నించాయి. అయితే, భారీ పోలీసు బందోబ‌స్తు వ‌ల్ల అది సాధ్యం కాలేదు. ఈ చ‌ర్య స‌రికాద‌ని, చంద్ర‌బాబు ద‌ళితుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌ని ఎంపీ నందిగం సురేష్ ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments