Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ విశ్వరూపం ... తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు!

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:22 IST)
తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమల్లోకి తీసుకుని వచ్చింది.
 
 
పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరిగిన వేళ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసిన సీఎం స్టాలిన్ రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్.. హెల్త్ సెక్రెటరీ రాధా కృష్ణన్ కూడా హాజరయ్యారు. సినిమా థియేటర్లు, మెట్రోరైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లలోకి కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించేలా నిబంధనలు తీసుకుని వచ్చారు.
 
 
ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలకు భక్తులను అనుమతిస్తారు. వివాహాది శుభకార్యాలకు 100 మందికి.. అంత్యక్రియలకు 50 మందే హాజరవ్వాలి. రాష్ట్రంలో లేటెస్ట్‌గా 2వేల 731కేసులు వచ్చాయి. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments