Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసులు పెరగడం- ఒమిక్రాస్ భయం నేపథ్యంలో కొవిసెల్ఫ్ హోమ్ టెస్టింగ్ డిమాండ్ 4.5 రెట్లు పెరిగింది

కేసులు పెరగడం- ఒమిక్రాస్ భయం నేపథ్యంలో కొవిసెల్ఫ్ హోమ్ టెస్టింగ్ డిమాండ్ 4.5 రెట్లు పెరిగింది
, బుధవారం, 5 జనవరి 2022 (17:50 IST)
దేశంలో కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావం మధ్య, మైలాబ్ ద్వారా భారతదేశం మొట్టమొదటి సెల్ఫ్ టెస్ట్ యాంటిజెన్ టెస్ట్ కిట్ అయిన కోవిసెల్ఫ్ కోసం డిమాండ్ గత కొన్ని వారాల్లో అకస్మాత్తుగా డిమాండ్ పెరిగింది. సెల్ఫ్ టెస్ట్ కిట్ ఒమిక్రాన్‌తో సహా కరోనావైరస్ యొక్కప్రధాన వేరియెంట్‌లను గుర్తించగలదు. కంపెనీ ఉత్పాదన పెంచింది మరియు భారతదేశవ్యాప్తంగా టెస్ట్‌ని అందుబాటులో ఉంచడం ప్రారంభించింది.

 
“గడిచిన 11 వారాల్లో కొవిసెల్ఫ్ సెల్ఫ్ టెస్టింగ్ కిట్ యొక్క డిమాండ్ 4.5 రెట్లు పెరిగింది. కోవిడ్ టెస్ట్ కిట్‌ల మా పోర్ట్‌ఫోలియోలో 2.4 మిలియన్ యూనిట్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది మరియు పరిస్థితి డిమాండ్ చేసినట్లయితే దీనిని పెంచడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రాబోయే నెలల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని మేం ఆశిస్తున్నాం, అని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఎండి, కో-ఫౌండర్ హస్ముఖ్ రావల్ అన్నారు.

 
పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, కంపెనీ అన్ని ప్రధాన ఆన్‌లైన్ ఛానల్స్‌తో పాటుగా కంపెనీ వెబ్ సైట్లో ఆన్ లైన్ ఆర్డర్ చేయడానికి టెస్ట్‌‌ని అందుబాటులో ఉంచింది. కొవిసెల్ఫ్ ఒక సురక్షితమైన, సులభంగా ఉపయోగించగల మరియు ప్రస్తుత టెస్ట్ విధానానికి ఖచ్చితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. దీనిని రోగలక్షణాలు ఉన్న లేదా లేని వ్యక్తులు మరియు ఐసిఎమ్‌ఆర్ మార్గదర్శకాల ప్రకారంగా ధృవీకరించబడ్డ కేసుల తక్షణ కాంటాక్ట్‌ల ద్వారా ఉపయోగించవచ్చు. మిడ్ నాసల్ స్వాబ్ టెస్ట్ వలే రూపొందించిన, ఇది కేవలం 15 నిమిషాల్లో పాజిటివ్ రిజల్ట్స్‌ని గుర్తించగలదు. ప్రతి యూనిట్‌లో టెస్టింగ్ కిట్, ఉపయోగించడానికి సూచనల కరపత్రం (ఐఎఫ్‌యు) కరపత్రం మరియు టెస్టింగ్ తరువాత సురక్షితంగా పారవేయడానికి బ్యాగ్ ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బండి సంజయ్‌కు - జేపీ నడ్డాకు తేడాలేదు : మంత్రి కేటీఆర్