Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిత్లీతో పంట దెబ్బతిందనీ ఒడిషా రైతు ఆత్మహత్య...

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:21 IST)
తిత్లీ తుఫాను అనేక మంది ప్రాణాలను బలితీసుకుంది. అలాగే అపార నష్టాన్ని కూడా మిగిల్చింది. ముఖ్యంగా, రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఫలితంగా ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
 
ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాలాహండీ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెత్తే.. రైతు పేరు పరమానంద లహజల్ (26). భార్య నగలు తాకట్టు పెట్టి 35 వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు.
 
ఆ డబ్బుతో నాలుగు ఎకరాల పొలంలో పంట వేశాడు. అయితే, ఇటీవల తిత్లీ తుఫాను సృష్టించిన విధ్వంసానికి పంట పూర్తిగా నీట మునిగిపోయింది. లహజల్ పంట వేసుకుంటే అప్పైనా తీరుతుందని భార్య నగలు పెట్టి మరి డబ్బులు తెచ్చుకున్నాడు. కానీ, ఈ తుఫాన్ వలన అంతా నాశనమైపోయింది.
 
పంట నష్టం జరగడంతో లహజల్ రుణం చెల్లించలేక.. జీవితం భారంగా మారిందనే ఆవేదనతో విషం తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments