Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019లో అధికారం మాదే.. ప్రతి ఒక్కర్నీ మరిచిపోను : వైసీపీ ఎమ్మెల్యే

అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు వైకాపా ఎమ్మెల్యే ఒకరు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడు ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నివేశనా స్థలాల్లో ఇప్పుడు టీడ

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (16:37 IST)
అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు వైకాపా ఎమ్మెల్యే ఒకరు గట్టివార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. నూజివీడు ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నివేశనా స్థలాల్లో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ స్కీమ్‌లో జీ ఫ్లస్‌-3 నిర్మాణాలు చేపట్టిందని, దీంతో తమకు అన్యాయం జరుగుతుండటంతో లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్లి స్టేటస్‌ కో తెచ్చుకుకున్నారు. అయినా మున్సిపల్‌ అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరించి జీ ఫ్లస్‌-3 నిర్మాణాలను చేపట్టారు. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుచరులతో కలిసి రహదారిపై బైఠాయించారు. దీంతో నూజివీడు తహసీల్దార్‌ విక్టర్‌బాబు, సీఐ రామ్‌కుమార్‌, రూరల్‌ ఎస్.ఐ చిరంజీవి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ప్రభుత్వం మాదే, ప్రస్తుత సంఘటనల్లో ఎవర్నీ మర్చిపోను.. ఏమనుకుంటున్నారో అంటూ హెచ్చరించారు.  పేదలకిచ్చిన నివేశనా స్థలాల్లో జీ ఫ్లస్‌-3 నిర్మాణాలు చేపట్టడం తగదంటూ ఆయన కోరారు. ఓడిపోయిన వారిని ఇక్కడ అందలమెక్కిస్తారా? ఏమను కుంటున్నారు? కోర్టు ఆదేశాలను అమలు చేయాలని మూడు రోజులుగా కమిషనర్‌, టీపీవోలకు చెబుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా ఈరోజు కూడా పనులు నిర్వహించడానికి ప్రయత్నించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments