Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలంలోకి గొర్రెలు వచ్చాయని... వైకాపా నాయకుడి దౌర్జన్యం... యువతులపై దాడి...

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. తన పొలంలోకి గొర్రెలు వచ్చి పంటనుపాడు చేశాయని ఒక వైకాపా నాయకుడు ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, మరో వ్యక్తిపై దాడికి తెగబడ్డాడు. ఈ దారుణ ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం మొర్సపూడిలో జరిగింది. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గ్రామానికి చెందిన పి.నాగమణి గొర్రెలు ఆంజనేయులు (వైకాపా బలపరిచిన పంచాయతీ వార్డు సభ్యుడి) మొక్కజొన్న తోటలోకి వెళ్లాయి. గొర్రెలు చేలో మేశాయని ఆంజనేయులు ఆమెను నిలదీశారు. దీంతో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. ఆంజనేయులు నాగమణిపై చెయ్యి చేసుకున్నారు. విషయాన్ని ఆమె దేవరగుంటకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి చెప్పటంతో మరోసారి గొడవ మొదలైంది. 
 
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆంజనేయులు నాగరాజును కొబ్బరిమట్ట విరిగేదాకా కొట్టారు. అక్కడే ఉన్న పెద్ద కర్ర తీసుకుని దాడికి తెగబడ్డారు. అడ్డొచ్చిన మహిళతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను.. విచక్షణారహితంగా చితకబాదారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. 
 
ఆంజనేయులు కూడా నాగమణి, మరో వ్యక్తి పైన ఫిర్యాదు చేశారని, ఇద్దరి ఫిర్యాదులు తీసుకున్నామని రూరల్‌ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. అయితే, తొలుత గొర్రెల కాపరులే రైతుపై దాడి చేశారన్న ప్రచారం జరిగినా వైకాపా నాయకుడే మహిళ, ఆమె ఇద్దరు ఆడపిల్లపై దాడి చేసినట్లుగా ఉన్న వీడియో వైరలయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

ప్రపంచ హృదయ దినోత్సవం: బాదంపప్పులతో మీ హృదయాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచండి

తర్వాతి కథనం
Show comments