Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన్ నాయుడు - మధుప్రియ మళ్లీ అరెస్టు...

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2020 (09:50 IST)
విజయవాడలో ఓ దళిత యువకుడికి శిరోమడనం చేసిన కేసులో అరెస్టు అయిన టాలీవుడ్ చిత్ర నిర్మాత నూతన్ నాయుడు, ఆయన భార్య మధుప్రియలు మరోమారు అరెస్టు అయ్యారు. తొలుత శిరోమండన కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ దఫా ఓ మోసం కేసులో పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఉద్యోగాల పేరుతో తమ నుంచి రూ.25 లక్షలు వసూలు చేశారంటూ తూర్పుగోదావరికి చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మధుప్రియ బెయిలు నుంచి విడుదలైన కాసేపటికే మళ్లీ ఆమెను అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. 
 
కాగా, తన ఇంట్లో పనిచేసి మానేసిన దళిత యువకుడు శ్రీకాంత్‌కు ఆగస్టు 28న ఇంట్లోనే శిరోముండనం చేయించిన ఘటన అప్పట్లో రాష్ట్రంలో పెను సంచలనమైన విషయం తెల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
ఈ కేసులో తొలుత మధుప్రియతోపాటు మరికొందరిని అరెస్టు చేయగా, పరారీలో ఉన్న నూతన్ నాయుడును ఆ తర్వాత అరెస్టు చేశారు. తాజాగా, మధుప్రియ బెయిలుపై బయటకు రాగా, కాసేపటికే చీటింగ్ కేసులో అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments