Webdunia - Bharat's app for daily news and videos

Install App

పర్చూరు పోరు : దగ్గుబాటి వెంకటేశ్వర రావు వర్సెస్ దగ్గుబాటి వెంకటేశ్వర్లు

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారింది. అలాంటి నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా పర్చూరు స్థానం ఒకటి. ఈ స్థానంలో సుధీర్ఘ కాలం తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. పైగా, వైకాపా తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఈయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం వైజాగ్ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 
 
అయితే, ఒకే పేరుతో ఇద్దరు నేతలు, ఒకే చోట నుంచి పోటీ చేసి, వీరు పోటీ చేసే పార్టీల గుర్తులు కూడా ఇంచుమించు ఒకేలా ఉండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చాలాకాలం తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తుండటంతో ఈ స్థానంపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకృతమైవుంది. 
 
అయితే, నియోజకవర్గంలో దాదాపు ఇదే పేరుతో మరో నేత బరిలో ఉండటం ఆయన అనుచరులను కలవరపెతుతోంది. వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు నామినేషన్‌ వేశారు. పేర్లు దగ్గరగా ఉండటం, పార్టీ ఎన్నికల గుర్తులు (ఫ్యాన్, హెలికాఫ్టర్) కూడా ఒకేలా ఉండడంతో తమ ఓట్లు ఎక్కడ చీలుతాయోనని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏప్రిల్ లో ఎర్రచీర - ది బిగినింగ్ డేట్ ఫిక్స్

తల్లి అంజనా దేవి ఆరోగ్యం పై మెగా స్టార్ చిరంజీవి వివరణ

లెవెన్ నుంచి ఆండ్రియా జర్మియా పాడిన ఇక్కడ రా సాంగ్ రిలీజ్

మజాకా నుంచి సొమ్మసిల్లి పోతున్నావే జానపద సాంగ్ రిలీజ్

కృష్ణ గారు రియల్ సూపర్ స్టార్. విజయ నిర్మల ఆడపులి : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

దుబాయ్-ప్రేరేపిత క్యాప్సూల్ కలెక్షన్‌ ప్రదర్శన: భారతీయ కోటూరియర్ గౌరవ్ గుప్తాతో విజిట్ దుబాయ్ భాగస్వామ్యం

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

తర్వాతి కథనం
Show comments