Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊరంతా కరెంట్ తీసి.. మీడియా కన్నుగప్పి...

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:29 IST)
ఎన్నారై జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అత్యంత గోప్యంగా హైదరాబాద్‌కు రలించారు. ఆమెను తరలింపునకు ముందు హైదరాబాద్ నగరంలో హైడ్రామా చోటుచేసుకుంది. 
 
ఈ హత్య కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత ఆమెను కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఐదు రోజుల పాటు ఉంచారు. అయితే, ఈ హత్య హైదరాబాద్‌లో జరగడంతో ఆమెను హైదరాబాద్ పోలీసులకు అప్పగించాలని భావించారు. ఇందుకోసం శిఖా చౌదరి ఎవరి కంటా కనిపించకుండా ఉండాలా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. 
 
సోమవారం రాత్రి అత్యంత నాటకీయ పరిణామాలు, హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు. ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు. 
 
ఆపై రెండు వాహనాల్లో ఒకటి విజయవాడవైపు, మరొకటి హైదరాబాద్ వైపు వెళ్లిపోయాయి. ఈ వాహనాలను మీడియా వెంబడించినా, ఆమె ఎందులో ఉందన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోయారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments