Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ రిపోర్టు తప్పుగా ఆర్థికంగా దెబ్బతీశారు... ఎన్ఆర్ఐ ఆస్పత్రిపై ఫిర్యాదు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (16:52 IST)
కరోనా నెగిటివ్ వచ్చిన పాజిటివ్ గా తప్పుడు నివేదిక ఇచ్చి తనను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఇబ్బంది పెట్టారని ఓ బాధితుడు ఆరోపించారు. ఈ వివరాల్లోకి వెళితే.. మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన కంకణాల శివ శంకర్ ఈనెల 20న ఎన్నారై ఆసుపత్రిలో కరోనా అనుమానంతో ఆర్‌‌టి‌పి‌సి‌ఆర్ పరీక్ష చేయించుకున్నారు. 
 
21వ తేదీ సాయంత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ నివేదికతో సంతృప్తి చెందని కంకణాల శివ శంకర్ 21వ తేదీన గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్‌కి వెళ్లి సిటీ స్కాన్ ఇతర కోవిడ్ పరీక్షలు చేయించుకొన్నారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని నివేదిక వచ్చింది. 
 
కరోనా పరీక్ష‌ల్లో నెగిటివ్‌గా వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ అ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కంకణాల శివ శంకర్‌కు ఫోన్ మెసేజ్ వచ్చింది. అప్పటికే ఒకరోజు కరోనా చికిత్స మందులు శివ శంకర్ వేసుకున్నారు. 
 
అసలు తనకు కరోనా లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు నివేదికను ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఇచ్చారని దీంతో తాను రెండు రోజులుగా తీవ్ర మానసిక వేదన చెందానని చెప్పారు. తప్పుడు నివేదిక తో తనను తీవ్ర క్షోభకు గురి చేసిన ఎన్నారై ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని కణాల శివ శంకర్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments