Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మాస్ రాజా వంతు... ఈడీ ఆఫీస్ కు చేరుకున్న హీరో రవితేజ!

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (12:02 IST)
మాద‌క ద్ర‌వ్యాల కేసులో మాస్ రాజా హీరో ర‌వితేజ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఈ రోజు   ఉద‌యం ప‌దిన్న‌ర‌కు ఈడీ కార్యాల‌యానికి చేరుకున్నారు. రవితేజ తో పాటు అత‌ని డ్రైవర్ శ్రీనివాస్ కూడా హాజర‌య్యాడు. నేరుగా త‌న ఫామ్ హౌస్ నుంచి ర‌వితేజ ఈడీ ఆఫీస్ కు వచ్చారు.  
 
హీరో త‌నీష్ నిర్వ‌హిస్తున్న‌ఎఫ్ క్లబ్ లో పార్టీలకు రవితేజ హాజ‌ర‌యిన‌ట్లు ఆరోపణలున్నాయి. దీనితో  టాలీవుడ్  డ్రగ్స్ కేసులో హీరో రవితేజను రెండో సారి ఈడీ ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఛార్మి, ర‌కుల్, పూరీ స‌హా సినీ ప్రముఖులు  ఐదుగురిని ఈడీ ప్రశ్నించింది. 
 
అయితే,  రెండు రోజుల నుంచి ఈడీ విచారణ రూటు మార్చినట్లుంది. మాద‌క ద్ర‌వ్యాల సూత్ర‌ధారి కెల్విన్ ఈడీకి స‌రెండ‌ర్ కావ‌డంతో కేసు మ‌లుపు తిరిగింది. ఈసారి కెల్విన్  తో పాటు హీరో రవితేజను విచారించే అవకాముంది. అంటే, ప్ర‌స్తుతం కెల్విన్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ కేసు విచారణ కొనసాగుతోంది. నిన్న కెల్విన్ తోపాటు రానాను విచారించిన అధికారులు, ఇవాళ కూడా కెల్విన్  సమక్షంలోనే ర‌వితేజ విచార‌ణ  కొనసాగించున్న‌ట్లు తెలుస్తోంది. డ్రగ్స్ వ్యవహారం, మనీలాండరింగ్ పై ర‌వితేజ‌ను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments