Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపుడు విశాఖ‌లో ఇన్‌సైడ్ ట్రేడింగ్: కొన‌క‌ళ్ళ ఆరోప‌ణ‌

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (22:21 IST)
సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వ  మొండివైఖరి విడనాడాల‌ని, అమరావతి పై వైసీపీ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలు అని తేలిపోయింద‌ని మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతోంద‌ని ఆరోపించారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, అమరావతి భూముల కొనుగోళ్లలో ఏ విక్రయదారుడుకీ నష్టం జరగలేదని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి చెబుతూనే ఉంద‌న్నారు. 
 
అమరావతి భూములపై విషం కక్కిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు కు కంకణబద్ధులై వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆరు సంవత్సరాల తరువాత భూములు అమ్మిన వారి తరుపున ఏ ఒక్క ఫిర్యాదు రాకపోగా, ఎవరో ఒకరు ఫిర్యాదు చేస్తే దానిని భూతద్దంలో న్యాయస్థానంలో చూపించేందుకు ప్రయత్నం చేసి వైసీపీ ప్రభుత్వం విఫలం అయింది అన్నారు.
 
ఆస్తుల బదిలీ చట్టం ప్రకారమే కొనుగోళ్లు జరిగాయ‌ని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తుల విలువ గణనీయంగా పడిపోయింద‌న్నారు. ప్రభుత్వం ఆస్తుల విలువ 20 రెట్లు పెరిగిందని చెప్పటం అన్యాయమన్నారు. ఇప్పటికైనా గత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతిని, నేటి వైసీపీ పాలకులు మన రాష్ట్ర  ఏకైక  రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి, బత్తిన దాసు, ప్రచార కార్యదర్శి, పి.వి. ఫణి కుమార్, సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments