Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు నోటీసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమే : వర్ల రామయ్య

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (12:32 IST)
తప్పుడు కేసులతో టిడిపి అధినేత చంద్రబాబును భయపెట్టాలనుకుంటున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సిఐడి నోటీసులు ఇచ్చారని ఆపార్టీ సీనయర్‌ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎపి సిఐడి అధికారులు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై టిడిపి నేతలు స్పందించారు. చంద్రబాబును రెండేళ్లలో ఏమీ చేయలేని జగన్‌ సర్కార్‌.. ఇప్పుడు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండ్రోజుల నుంచి సిఎం జగన్‌ క్యాంప్‌ భయపడుతోందన్నారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంలో జగన్‌ ఉన్నారని విమర్శించారు. ఎ1, ఎ2 బెయిల్‌ రద్దయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎపి సిఎంపై ఉన్న కేసులు దేశంలో ఏ ముఖ్యమంత్రులపైనా లేవని వర్ల రామయ్య పేర్కొన్నారు.

మరో టిడిపి నేత బోండా ఉమా మాట్లాడుతూ.. 21 నెలలుగా వైసిపి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వైసిపి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments