Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్థానికేతరులకు వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు ఇవ్వబడవు: ధర్మారెడ్డి

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (14:36 IST)
గత ఆరునెలల్లో ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ ఇన్పెక్షన్ కాకుండా కాపాడగలిగామన్నారు తిరుమల టిటిడి ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి. ప్రతిరోజు 300 మంది భక్తులకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. టిటిడి ఉద్యోగుల్లో కోవిడ్ కేసులే లేవన్నారు. తిరుపతిలో టిటిడి ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించారు టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అర్బన్ జిల్లా ఎస్పీ రమేష్ రెడ్డి.
 
నిబంధనలు గట్టిగా పాటించడం వల్ల తిరుమల, తిరుపతిలలో కోవిడ్‌ను అరికట్టగలిగామని చెప్పిన ధర్మారెడ్డి.. ఆన్ లైన్ శీఘ్రదర్సనం ద్వారా వైకుంఠ ఏకాదశి దర్సనానికి ఒకే రోజు 2 లక్షల టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నట్లు చెప్పారు. సర్వదర్సనం టోకెన్లు స్థానికులకు మాత్రమే రండి.. స్థానికేతరులు దయచేసి రావద్దని విజ్ఞప్తి చేశారు. 
 
శ్రీవాణి ట్రస్టు ద్వారా పదిరోజులకు సరిపడా ప్రతి రోజు 2 వేల టిక్కెట్లు ఇస్తామనీ, ఈ నెల 24వతేదీ నుంచి ప్రతిరోజు స్థానికులకు 8వేల టిక్కెట్లు ఇస్తామన్నారు. తిరుపతి లోని ఐదు కౌంటర్లలో టోకెన్లను భక్తులు పొందవచ్చన్నారు. తిరుమలలో ప్రతిరోజు 30 నుంచి 35 వేల మంది భక్తులకు మాత్రమే దర్సనం చేయించగలమని.. అంతకు మించి భక్తులకు దర్సనం చేయించలేమని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments