Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదు మ్యాచ్‌ల టిక్కెట్లు ఒక్కరోజే ఖాళీ! (video)

ఐదు మ్యాచ్‌ల టిక్కెట్లు ఒక్కరోజే ఖాళీ! (video)
, శుక్రవారం, 20 నవంబరు 2020 (14:35 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇటీవల యూఏఈ గడ్డపై జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ పోటీలు ముగిసిన వెంటనే అక్కడ నుంచి అటే సిడ్నీ నగరంలో కాలుమోపింది. ప్రస్తుతం కోవిడ్ మార్గదర్శకాల మేరకు 14 రోజుల క్వారంటైన్‌లో భారత క్రికెట్ జట్టు ఉంది. 
 
అయితే, ఈ పర్యటనలో భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు ట్వంటీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలుత వన్డే సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుంది. వన్డే సిరీస్, టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. 
 
అయితే, ఈ రెండు జట్ల పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌ల టికెట్లు శుక్రవారం అమ్మకానికి ఉంచగా తొలిరోజే అదిరిపోయే స్పందన వచ్చింది. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల టికెట్లను విక్రయానికి పెట్టగా, 5 మ్యాచ్‌ల టికెట్లు తొలిరోజే అమ్ముడయ్యాయి. 
 
అభిమానులు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేవలం తొలి వన్డేకు సంబంధించి 2 వేల టికెట్లు మాత్రమే ప్రస్తుతం మిగిలున్నాయి. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆసీస్ స్టేడియాల్లో 50 శాతం సీటింగ్‌నే అనుమతిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికా జట్టులో ఓ ఆటగాడికి కరోనా.. పేరు మాత్రం చెప్పట్లేదు..