నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు... కొత్త పద్ధతి అమలు.. రాజీనామా చేస్తారా?

Webdunia
శనివారం, 28 మే 2022 (09:26 IST)
తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
పార్టీ సంస్థాగత మార్పులపై ఒక విధంగా షాక్‌కు గురిచేసే ప్రతిపాదనలు చేశారు నారా లోకేష్. పార్టీ పదవుల విషయంలో కొత్త పద్ధతికి తెరలేపారు. పార్టీని బలోపేతం చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. 
 
పార్టీ నేతలకు దీర్ఘకాలం పదవుల విధానాన్ని రద్దు చేయాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ విధానాన్ని తన నుంచే అమలు చేయాలని భావిస్తున్నానంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇంకా నారా లోకేష్ మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశానని.., ఈ సారి తాను తప్పుకుని వేరొకరికి అవకాశం కల్పిస్తాని లోకేష్ చెప్పారు. అలాగే వరుసగా రెండుసార్లు ఒకే పదవిలో ఉన్నవారికి బ్రేక్ ఇవ్వాలన్నారు.
 
అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని.. ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి, కష్టపడి పనిచేసేవారికి అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు నారాలోకేష్ తెలిపారు. లోకేష్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. 
 
స్వయంగా పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నేతలకు ఎన్నికల్లో ఛాన్స్ ఇచ్చేది లేదని చెప్పడంతో కొందరు సీనియర్ నేతలకు షాక్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments