వైకాపా సర్కారుతో పోటీ పడే రాష్ట్రం దేశంలోనే లేదు.. జగన్

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:25 IST)
పేదలకు సంక్షేమం అందించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం పోటీపడదని వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత తన 'మేమంత సిద్ధం' ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సంక్షేమ పింఛన్ లబ్ధిదారులతో జరిగిన ఇంటరాక్షన్‌లో ఈ విషయాన్ని తెలిపారు. 
 
పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో పోటీ పడే రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రం లేదన్నారు. అవినీతి, వివక్ష లేకుండా నెలకు రూ. 2,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. రాష్ట్రాన్ని బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలతో పోల్చి చూస్తే, వారంతా ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని చెప్పారు.
 
గత టీడీపీ ప్రభుత్వం నెలకు రూ.1000 చొప్పున 39 లక్షల మంది లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు పంపిణీ చేసేదని, 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేశారని, ప్రజల గురించి ఆలోచించలేదన్నారు. 
 
ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ రోజు చింతలచెరువు, వినుకొండ, విట్టంరాజుపల్లి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెంలో రాత్రి బస చేయనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 21 రోజుల ఎన్నికల ప్రచార బస్సుయాత్రకు రెడ్డి శ్రీకారం చుట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments