అన్నం వండిపెట్టలేదని రూమ్‌మేట్‌ను కొట్టి చంపేశారు..

సెల్వి
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (23:18 IST)
హైదరాబాద్ జీడిమెట్లలో రూమ్‌మేట్‌ను హత్య చేశారు. అన్నం వండలేదనే పాపానికి 38 ఏళ్ల వ్యక్తిని అతని రూమ్‌మేట్స్ కొట్టి చంపారు. ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన హన్స్‌రామ్‌ అనే బాధితుడు గతంలో కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. 
 
అతని నిరంతర మద్య వ్యసనం అతని భార్యపై నిరంతర వేధింపులకు దారితీసింది. ఇక వేధింపులు భరించలేక, పుట్టింటికి వెళ్లింది. ఆపై హన్స్‌రామ్‌ను వారి ఇంటిని ఖాళీ చేసి బినయ్ సింగ్ గదికి మకాం మార్చాడు.
 
బినయ్ సింగ్ స్థానిక గ్రానైట్ వ్యాపారి వద్ద ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడి గదిలోనే హన్స్‌రామ్ అనే వ్యక్తితో కలిసివున్నాడు. అలాగే అదే గదిలో బీహార్‌కు చెందిన సోనూ తివారీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్ కుమార్‌లు నివసిస్తున్నారు. 
 
మంగళవారం, పని నుండి తిరిగి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న నిందితులు, అన్నం వండలేదని బినయ్ సింగ్‌పై దాడి చేశారు. ఇంకా వారు హన్స్రామ్‌ను కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments