Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలోని సినిమా థియేటర్లకు నో లైసెన్స్, మరెలా?

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (22:44 IST)
రాష్ట్రప్రభుత్వం జిఓ.నెంబర్ 35పై సినిమా థియేటర్ల యజమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం విడుదల చేసిన జివోతో ఎలా థియేటర్లను నడుపుకోగలమంటూ ప్రశ్నిస్తున్నారు. అది కూడా తెర వెనుక నుంచే... అంటే తెర ముందుకు వచ్చి ప్రశ్నించే పరిస్థితుల్లో థియేటర్ల యజమానులు లేరు. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వారి ఆలోచన.

 
ఇదిలా నడుస్తుండగానే నిన్న ఒక్కరోజే సుమారుగా 11 థియేటర్లను సీజ్ చేశారు. మరో 12 థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, పీలేరు, పుంగనూరు లాంటి ప్రాంతాల్లో థియేటర్లను మూసివేయడంతో ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు.

 
అయితే ఎన్నో సంవత్సరాల నుంచి థియేటర్లను నడుపుతున్నా రెన్యువల్ చేసుకోకపోవడంతో రెవిన్యూ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి సీజ్ చేశారు. ఇది ప్రేక్షకులకు కాస్త ఆనందాన్ని కలిగించినా థియేటర్ల యజమానుల్లో మాత్రం ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

 
ఈ నేపథ్యంలో తిరుపతిలో సుమారు 24కి పైగా థియేటర్లు ఉన్నాయి. ఇందులో చాలా థియేటర్లకు లైసెన్స్ కూడా లేదు. లైసెన్స్‌లు పూర్తయినా రెన్యువల్ మాత్రం చేసుకోలేదు. ఆదాయం వస్తున్నా రెన్యువల్ చేసుకోకపోవడంతో రెవిన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. తిరుపతిలోని ప్రధాన థియేటర్లపై కూడా రెవిన్యూ అధికారులు సోదాలు చేయడానికి సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments