Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఫ్రీగా ఏపీ - 24 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాలేదు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:23 IST)
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. సోమవారం కరోనా ఫ్రీ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఏపీలో గత కొద్ది రోజులుగా సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్న కరోనా కేసులు.. సోమవారం మాత్రం జీరో వచ్చాయి. ఈ నెల 20,21వ తేదీల్లో ఒక కేసు నమోదవ్వగా.. 22న నాలుగు కేసులు, 23వ తేదీన రెండు కేసులు నమోదయ్యాయి. 
 
ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మరికొద్ది రోజులు ఇలానే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 2,163 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఒక్కటి కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. 12 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు.
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 3,3519,781 శాంపిల్స్ పరీక్షించినట్లు చెప్పారు. మరిన్ని జాగ్రత్తలు పాటిస్తే.. త్వరలో రాష్ట్రాన్ని కరోనా ఫ్రీ స్టేట్‌గా ప్రకటించవచ్చని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments