Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో అమిత్ షా కీలక భేటీ.. సమావేశానికి వైకాపా వ్యూహకర్త

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఏపీకి చెందిన పార్టీ నేతలను ఢిల్లీకి పిల

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (18:45 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఏపీకి చెందిన పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని శనివారం కీలక మంతనాలు జరిపారు. అయితే, ఈ సమావేశానికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ హాజరుకావడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. అవిశ్వాస తీర్మానం, ఏపీకి కేంద్ర సర్కారు చేసిన సహాయంపై చర్చించినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కంటే ఎక్కువ నిబద్ధతతో ఉన్నామన్నారు. భవిష్యత్‌లోనూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమిత్ షా‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాంమాధవ్.. సెంటిమెంట్‌కు అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు ప్రశ్నలు వేస్తున్నారు.. వాటన్నింటికీ సమాధానం చెబుతామని, అదేవిధంగా తాము అడిగే ప్రశ్నలకూ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments