Webdunia - Bharat's app for daily news and videos

Install App

నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. తిరుమల శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు..

Webdunia
గురువారం, 26 నవంబరు 2020 (13:39 IST)
తిరుమల శ్రీవారి ఆలయ ముందుకు నీళ్ళు రావాలంటే అది సాధ్యం కాదు. కానీ నివర్ ఎఫెక్ట్‌తో తిరుమల గిరుల్లో వరదనీరు పొంగిపొర్లుతోంది. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుమలలోని డ్యాములన్నీ నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఎండిపోయిన చెట్లు పచ్చగా భక్తులకు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి.
 
అయితే తిరుమల శ్రీవారి ఆలయం ముందు వరదనీరు నిలిచిపోయింది. దీంతో టిటిడి సిబ్బంది ఆ వరద నీటిని మిషన్ల సహాయంతో ఆలయానికి దూరంగా పంపింగ్ చేస్తున్నారు. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో టిటిడి సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
 
ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న భక్తులకు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్దే జాగ్రత్తలు చెబుతున్నారు. వర్షం పడుతుండటంతో నెమ్మదిగా వెళ్ళాలని సూచిస్తున్నారు. మోటారు సైకిళ్లపై వెళుతున్న వారినైతే మరింత నెమ్మదిగా వెళ్ళాలని సూచనలిస్తున్నారు టిటిడి సిబ్బంది. అయితే శ్రీవారి ఆలయం ముందుకు వరదనీరు రావడం మాత్రం చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడే వచ్చిందని టిటిడి అధికారులు చెబుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments