Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరవకొండలో ఘోరం : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:54 IST)
అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం, బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఓ శుభకార్యానికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషురులు ఉన్నారు.
 
కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు ఉరవకొండ మండలం, నిమ్మగల్లు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రమాదస్థలం శోకసముద్రంలా మారింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ రాష్ట్ర నేత కోకా వెంకటప్ప కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments