Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరవకొండలో ఘోరం : ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:54 IST)
అనంతపురం జిల్లా ఉరవకొండలో దారుణం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం, బుదగవి వద్ద ఇన్నోవా కారు, లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఓ శుభకార్యానికి వెళ్లి కారులో బళ్లారి నుంచి అనంతపురం తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషురులు ఉన్నారు.
 
కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతులు ఉరవకొండ మండలం, నిమ్మగల్లు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ప్రమాదస్థలం శోకసముద్రంలా మారింది. 
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో బీజేపీ కిసాన్ రాష్ట్ర నేత కోకా వెంకటప్ప కూడా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments