Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో బాధితుడు జగన్ హాజరుకావాల్సిందే : ఎన్.ఐ.ఏ కోర్టు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (11:19 IST)
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) చేపట్టగా, కేసు విచారణ కూడా ఎన్.ఐ.ఏ కోర్టులో సాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ఎన్.ఐ.ఏ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల పదో తేదీన విచారణకు రావాలని బాధితుడు జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వర రెడ్డి కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 
మరోవైరపు, మంగళవారం ఇదే కేసులో విశాఖ ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. అలాగే, ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్‌ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున బాధితుడైన సీఎం జగన్ తప్పుకుండా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments