Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో బాధితుడు జగన్ హాజరుకావాల్సిందే : ఎన్.ఐ.ఏ కోర్టు

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (11:19 IST)
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో ఓ వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) చేపట్టగా, కేసు విచారణ కూడా ఎన్.ఐ.ఏ కోర్టులో సాగుతోంది. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి విజయవాడ కోర్టులో ఎన్.ఐ.ఏ విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. వచ్చే నెల పదో తేదీన విచారణకు రావాలని బాధితుడు జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. సీఎంతో పాటు ఆయన పీఏ నాగేశ్వర రెడ్డి కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 
మరోవైరపు, మంగళవారం ఇదే కేసులో విశాఖ ఎయిర్‌పోర్టు అథారిటీ కమాండర్ దినేశ్‌ను కోర్టు విచారించింది. ఈ సందర్భంగా పోలీసులు కోడికత్తిని, మరో చిన్న కత్తిని కోర్టుకు అప్పగించారు. అలాగే, ఈ కేసుకు సంబంధించిన ఓ సెల్‌ఫోన్, పర్సును కూడా ఎన్ఐఏ ధర్మాసనానికి అందించారు. అనంతరం, తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున బాధితుడైన సీఎం జగన్ తప్పుకుండా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments