పెళ్లయిన మూడో రోజు ప్రియుడితో లేచిపోయిన నవ వధువు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (08:30 IST)
తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు ఓ నవ వధువు వివాహమైన మూడో రోజే తన ప్రియుడితో లేచిపోయింది. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో జరిగింది. దీన్నీ జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
జిల్లాలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ యువతికి పొరుగూరుకు చెందిన ఓ యువకుడితో ఈ నెల 9వ తేదీన ఇరు కుటుంబాల పెద్దలు కలిసి ఘనంగా వివాహం జరిపించారు. అయితే, మాధవరం గ్రామానికి చెందిన శివాజీ అనే యువకుడితో యువతి పీకల్లోతు ప్రేమలో ఉంది. పెద్దల ఒత్తిడితో ఈ పెళ్లికి ఆమె బలవంతంగా అంగీకరించింది. అదేసమయంలో తన ప్రియుడిని వదిలి ఉండలేకపోయింది. 
 
ఈ క్రమంలో పెళ్లి అయిన మూడో రోజే వధువు ప్రియుడు శివాజీతో కలిసి ఊరువదిలి పారిపోయింది. ఈ విషయం తెలిసిన వధువు బంధువులు ఆదివారం రాత్రి మాధవరం చేరుకుని శివాజీ ఇంటికి నిప్పుపెట్టారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే, శివాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments