Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై నాలుగు రోజులే, నవ దంపతులను పొట్టనబెట్టుకుంది

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:16 IST)
కాళ్ల పారాణి ఆరక ముందే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనబెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవదంపతులు యడవల్లి వెంకటేశ్ (30), మానస నవ్య (26)లు కన్నుమూశారు. జూన్  14న వారి వివాహం కాగా గురువారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా గోవాడ నుంచి భార్య మానస ఆమె సోదరుడు భరత్‌తో కలిసి వెంకటేశ్ విశాఖ జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరాడు.
 
కారులో వెళుతుండగానే పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని పూళ్ల రోడ్డులో కారు అదుపుతప్పింది. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపుకు దూసుకెళ్లగా ఆ వైపు ఏలూరు నుంచి వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. దీనితో కారులో వున్న వెంకటేశ్, మానస నవ్య, భరత్, కారు డ్రైవర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అటువైపు నుంచి వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ క్షతగాత్రులను స్థానికుల సాయంతో తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే  వెంకటేశ్, నవ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments