Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లై నాలుగు రోజులే, నవ దంపతులను పొట్టనబెట్టుకుంది

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (11:16 IST)
కాళ్ల పారాణి ఆరక ముందే వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు పొట్టనబెట్టుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవదంపతులు యడవల్లి వెంకటేశ్ (30), మానస నవ్య (26)లు కన్నుమూశారు. జూన్  14న వారి వివాహం కాగా గురువారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా గోవాడ నుంచి భార్య మానస ఆమె సోదరుడు భరత్‌తో కలిసి వెంకటేశ్ విశాఖ జిల్లా సబ్బవరానికి కారులో బయలుదేరాడు.
 
కారులో వెళుతుండగానే పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు సమీపంలోని పూళ్ల రోడ్డులో కారు అదుపుతప్పింది. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపుకు దూసుకెళ్లగా ఆ వైపు ఏలూరు నుంచి వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. దీనితో కారులో వున్న వెంకటేశ్, మానస నవ్య, భరత్, కారు డ్రైవర్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అటువైపు నుంచి వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ క్షతగాత్రులను స్థానికుల సాయంతో తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే  వెంకటేశ్, నవ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments