భారీ వర్షానికి అండ‌ర్ బ్రిడ్జిలో నీరు... పెళ్లి కూతురు బలి

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (10:30 IST)
శుక్ర‌వారం అర్ధ‌రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ న‌వ వ‌ధువు బ‌లి అయిపోయింది. తిరుపతి బాలాజీ కాలనీ నుండి యం.ఆర్.పల్లి కి వెళ్లే దారిలో వెంగమాంబ కూడలి(వెస్ట్ చర్చ్) వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నీళ్లు 8 ఆడుగులకు పైగా నిలబడిపోయాయి. లోతు తెలియని సుమో పెళ్లి వాహనం దాటుకుని వెళ్లొచ్చు అనుకొన్న డ్రైవర్ నీళ్లలోకి వేగం వెళ్ల‌గా మ‌ధ్య‌లో సుమో ఆగిపోయింది. అప్పటికే సుమో మునిగిపోయేటంత లోతులోకి వెళ్లడంతో ఊపిరి ఆడక అందులోని పెళ్లి కూతురు అక్కడికక్కడే వాహనంలోనే  చనిపోయింది. మ‌రో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటన రాత్రి సుమారు 1:30 పైన జరిగింది.. ఆ నీటిలో ఒక లారీ కూడా మునిగిపోయింది. వెస్ట్ చర్చి వద్ద  అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. పెద్ద వ‌ర్షం కుర‌వ‌డంతో 8 అడుగులు లోతు నీరుంది. ఈ నీటికి ఊపిరి ఆడ‌క సుమోలో చిక్కుకున్న ఏడుగురు న‌ర‌క‌యాత‌న ప‌డ్డారు. నవ వధువు సంధ్య అక్క‌డిక‌క్క‌డే సీట్లో కూర్చుని అలాగే మృతి చెందింది. మరో చిన్నారికి అస్వస్థతగా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు వ‌చ్చి కాపాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments