Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు షాక్ - స్వయంగా కోర్టుకు రావాల్సిందే..

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (15:24 IST)
కోడికత్తి కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. కోడికత్తి శ్రీనివాస్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే, కోర్టు టేప్ రికార్డర్‌గా ఉండదని వ్యాఖ్యానించింది. 
 
ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్టేట్మెంట్ రికార్డు చేశామని ఎన్.ఐ.ఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని ప్రశ్నించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 
 
ఈ కేసులో 56 మందిని విచారిస్తే 1 నుంచి 12 వరకు ఉన్నవారి స్టేట్మెంట్లు, చార్జిషీట్‌లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్జి స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments