Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడికత్తి కేసులో సీఎం జగన్‌కు షాక్ - స్వయంగా కోర్టుకు రావాల్సిందే..

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (15:24 IST)
కోడికత్తి కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. కోడికత్తి శ్రీనివాస్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే, కోర్టు టేప్ రికార్డర్‌గా ఉండదని వ్యాఖ్యానించింది. 
 
ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్టేట్మెంట్ రికార్డు చేశామని ఎన్.ఐ.ఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని ప్రశ్నించకుండా మిగతా సాక్షులను విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 
 
ఈ కేసులో 56 మందిని విచారిస్తే 1 నుంచి 12 వరకు ఉన్నవారి స్టేట్మెంట్లు, చార్జిషీట్‌లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్జి స్పష్టం చేశారు. అదేసమయంలో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌కు కోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments