Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగులకు షాక్ : 10.10 తర్వాత వస్తే వేతనంలో కోత

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదయం 10.10 గంటలలోపు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో సెలవు పడిపోతుందని పేర్కొంది. ఉద్యోగులు ఖచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇకపై ఆలస్యంగా విధులకు వస్తే మాత్రం ఆ రోజున లీవ్ పెట్టినట్టుగానే పరిగణించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వం శనివారం ఏకంగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా విధిగా 10 గంటల లోపు కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఓ పది నిమిషాల వరకు ఆలస్యమైతే ఫర్వాలేదు కానీ, అంతకు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవు పడిపోతుందని పేర్కొంది. 
 
అదేసమయంలో ఒక నెలలో ఉదయం 10.10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కార్యాలయానికి వచ్చేందుకు మూడు సార్లు అనుమతి ఇస్తారు. ఆ పరిమితి దాటితే వేతనంలో కోత విధిస్తారని తెలిపింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments