Webdunia - Bharat's app for daily news and videos

Install App

టూరిజం మేనేజర్ ఊచలు లెక్కిస్తున్నాడు

Webdunia
బుధవారం, 1 జులై 2020 (16:46 IST)
మాస్క్ పెట్టుకో అన్నందుకు వికలాంగురాలని కూడా చూడకుండా గొడ్డును బాదినట్లు బాదిన నెల్లూరు పర్యాటక శాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పాపం పండింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు.
 
వికలాంగురాలిని అతి దారుణంగా కొడుతున్న విజువల్స్ సి.సి.ఫుటేజ్ ద్వారా మీడియాకు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అప్పటి వరకు స్పందించని పోలీసులు కేసు నమోదు చేశారు. ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్ళడంతో విషయం కాస్త మరింత సీరియస్ అయ్యింది.
 
అలాగే టిడిపి నేతలు ఈ వ్యవహారంపై తీవ్రంగానే స్పందించారు. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద భాస్కర్‌ను అరెస్టు చేశారు. అతనికి కోవిడ్-19 పరీక్షలు  చేయించారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే సబ్ జైలుకు తరలించేందుకు సిద్ధమయ్యారు.
 
వికలాంగురాలిపై దాడి ఘటనను వికలాంగుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. దివ్యాంగులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సంఘం నేతలు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments