Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్‌ టాక్‌పై నిషేధం.. స్వదేశీ మిట్రాన్ యాప్‌కు పెరిగిన డిమాండ్

Webdunia
బుధవారం, 1 జులై 2020 (16:36 IST)
చైనాకు చెందిన టిక్ టాక్‌తో సహా మొత్తం 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో స్వదేశీ యాప్ మిట్రాన్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. గత 24 గంటల్లోనే ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య 11 రెట్లు పెరిగినట్టు మిట్రాన్ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఈ యాప్‌ను దేశంలో 17 మిలియన్ (1.7 కోట్ల) వినియోగదారులు డౌన్‌లోడ్ చేసినట్లు ప్రకటించింది. అలాగే, గత రెండు నెలల్లోనూ భారతదేశంలో అత్యధికంగా ప్రజలు డౌన్‌లోడ్ చేసుకున్న యాప్‌ కూడా ఇదేనట. 
 
'భారతీయ వినియోగదారులు మిట్రాన్‌ను వేగంగా స్వీకరించడం ఆనందంగా ఉంది. చైనా యాప్‌ల నిషేధం తర్వాత మా అంచనాలకు మించి డౌన్‌లోడ్‌ చేసుకున్న వారి సంఖ్య 11రెట్లు పెరిగింది' అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో శివాంక్‌ అగర్వాల్‌ పేర్కొన్నాడు.  
 
'మేం దృఢమైన బ్యాకెండ్ మౌలిక సదుపాయాలను నిర్మించాం. మా ప్లాట్‌ఫాం ఇప్పుడు పూర్తిగా స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. అందుకే గణనీయంగా డౌన్‌లోడ్లు పెరుగుతున్నాయి' అని మరో ఫౌండర్ అనిశ్‌ ఖండేల్వాల్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments