Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో సూర్యుడి ప్రతాపం.. పదేళ్ళనాటి బండరాయి పగిలిపోయింది!

Webdunia
సోమవారం, 30 మే 2016 (09:41 IST)
వేసవికాలం మంటెక్కిపోతోంది. భానుడి తీవ్రతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఠారెత్తిపోతున్నారు. కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా.. తెలంగాణ ప్రజలు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలకు తోడుగా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్నా కూడా సూర్యతాపాన్ని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం ఏడు గంటలైనా వాతావరణం చల్లబడడం లేదు. 
 
కాగా రోహిణి కార్తెలో కాసే ఎండలకు రోళ్లు పగులుతాయని సామెత ఉంది. ఇప్పుడది సాక్షాత్తుగా నిజమైంది. భానుడి ప్రతానికి రోళ్లు కాదు పెద్ద కంకుల గుండు నిలువునా ముక్కలైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం ముస్తాపురంలో దశాబ్దాల క్రితం నాటి కంకులు గుండు ఎండలకు రెండు ముక్కలైంది. కాగా నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, మర్రిపాడు, ఉదయగిరి, అనంతసాగరం ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments