మళ్లీ హీటెక్కిన సింహపురి పాలిటిక్స్... ఆనం వర్సెస్ నేదురుమల్లి

Webdunia
గురువారం, 25 మే 2023 (11:56 IST)
సింహపురి పాలిటిక్స్ మళ్లీ హీటెక్కాయి. ఎన్నికలకు ముందే సింహపురిలో వాతావరణం హీటెక్కింది. ఈసారి రెబల్‌ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్‌ నేదురుమల్లి కావడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తాజాగా మౌనం వీడారు. 
 
గత మూడు నెలలుగా రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆనం ఇటీవల ఆత్మకూరు నియోజకవర్గంలో సంచలన కామెంట్స్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆనం… చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే, తానూ అక్కడి నుంచే బరిలో దిగుతానని కామెంట్‌ చేశారు. 
 
అంతేగాకుండా 60 శాతం ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని హాట్‌ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ వెంకటగిరి ఇంఛార్జ్‌గా ఉన్న నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఆనం కామెంట్స్‌పై కౌంటర్‌ ఇచ్చారు. 60 శాతం కాదు కదా, ఆరుగు కూడా  వైకాపాను వీడే ప్రసక్తే లేదన్నారు. 
 
ఆత్మకూరులో కాదు…ఆనంకు దమ్ముంటే వెంకటగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఈ సవాలుపై ఆనం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments