Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్తుతెలియని ప్రాంతానికి ఆనందయ్య - బంధువుల ఆందోళన

Webdunia
గురువారం, 27 మే 2021 (10:57 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బోణిగి ఆనందయ్యను నెల్లూరు జిల్లా పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. గత నాలుగైదు రోజులుగా కృష్ణపట్నం గోపాలపురం సీవీఆర్ అకాడమీ నుంచి ఆనందయ్యను పోలీసులు తరలించారు. ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారో పోలీసులు స్పష్టం చేయడం లేదు. 
 
దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఆనందయ్య గురించి ఏ సమాచారం లేకపోవడంతో బంధువులు పోలీసులను నిలదీస్తున్నారు. 
 
మరోవైపు కృష్ణపట్నంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అంబులెన్సుల్లో వచ్చేవారికి కూడా అనుమతి నిరాకరిస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. 
 
మరోవైపు, పోలీసుల వలయంలో ఉన్న ఆనందయ్యతో ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేతలు దొంగచాటుగా మందు తయారు చేయించుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆనందయ్యను సీవీఆర్ అకాడెమీ నుంచి మరో ప్రాంతానికి పోలీసులు గురువారం తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments