Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 మంది అమ్మాయిలను ట్రాప్ చేసిన లెక్చరర్.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 26 మే 2020 (11:04 IST)
తన వద్ద చదువుకునే అమ్మాయిలకు వల వేశాడో లెక్చరర్. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది అమ్మాయిలను ఆ కామాంధ లెక్చరర్ ట్రాప్ చేశాడు. చివరకు పాపం పండి.. ఓ యువతి దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ లెక్చరర్ బండారం బయటపడింది. ఇది నెల్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. తన వద్ద చదువుకునే అమ్మాయిలపై కన్నేశాడు. అలా 15 మందిని ట్రాప్ చేసి ప్రేమ పాఠాలు వల్లించసాగాడు. ఈ క్రమంలో ఓ యువతి మొబైల్ నంబరు తీసుకుని అసభ్యకర చాటింగ్ చేస్తూ, అశ్లీల ఫోటోలు పంపసాగాడు. 
 
అంతేకాకుండా, తనతో సన్నిహితంగా మెలగాలనీ, శృంగారంలో పాల్గొనాలంటూ ఒత్తిడి చేయసాగాడు. అలాగే, ఇతర విద్యార్థినిల వద్ద కూడా ఇదేవిధంగా నడుచుకోసాగాడు. అయితే, ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ బాధిత విద్యార్థిని నెల్లూరులో దిశా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments