నెల్లూరు నీట మునక : ప్రమాదకరంగా జలాశయాలు - ఉధృతంగా పెన్నానది

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (13:30 IST)
నెల్లూరు జిల్లా నీట మునిగింది. గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న కుండపోత వర్షాలలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకునివున్నాయి. ఈ జిల్లాలోని అన్ని జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయి. వీటిలో అనేకం ప్రమాదకరంగా ఉన్నాయి. కట్టలు తెగి ఎపుడు ఊర్లపై పడుతాయోనన్న ఆందోళనలో స్థానిక ప్రజలతో పాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ముఖ్యంగా, జిల్లాలోని కండలేరు, సోమశిల డ్యామ్‌ల నుంచి భారీ మొత్తంలో నీటిని కిందికి విడుదల చేశారు. దీనికితోడు వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పొలాలన్నీ నీట మునిగివున్నాయి. 
 
అలాగే, ఇళ్లచుట్టూత నీళ్లు వచ్చిచేరాయి. ఎటు చూసినా నీళ్లు కంటికి కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి. దీంతో మూగ జీవాలు మేత లేక అల్లాడుతున్నాయి. ఈ జిల్లాలోని జాతీయ రహదారి 16పై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. 
 
ప్రస్తుతం సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. జలాశయానికి 96569 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 115396 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేశారు. దీంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments