Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు పచ్చని చీర.. గజ్జెల సవ్వడి.. ఆ రాత్రి ఆలయం చుట్టూ..?

రాత్రిపూట ఆలయాల్లో దేవతామూర్తులు సంచరిస్తారని.. ఆ ప్రాంత ప్రజల సంరక్షణార్థం కాపలా కాస్తారని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Webdunia
శుక్రవారం, 19 అక్టోబరు 2018 (17:53 IST)
రాత్రిపూట ఆలయాల్లో దేవతామూర్తులు సంచరిస్తారని.. ఆ ప్రాంత ప్రజల సంరక్షణార్థం కాపలా కాస్తారని పెద్దలు చెప్తుంటారు. అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది.


జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి రాత్రి వేళలో తాళాలు వేసిన తర్వాత, ఓ మహిళ పసుపు పచ్చని చీరతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. 
 
అయితే ఆలయ నిర్వాహకులు మాత్రం అమ్మవారి ఆలయాన్ని రాత్రి పదింటికే మూతలు వేశామని అంటున్నారు. పది గంటలకల్లా.. ఆలయాన్ని మూతపెడితే.. దేవాలయం లోపల ఎవరూ వుండే అవకాశం లేదని నిర్వాహకులు నొక్కి చెప్తున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో మాత్రం పసుపు పచ్చని చీరలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన మహిళా రూపం కనిపిస్తోంది. 
 
భక్తులు మాత్రం ఆమె స్వయంగా అమ్మవారేనని అంటున్నారు. రాత్రిపూట తమకు గజ్జెల చప్పుడు కూడా వినిపించిదని చుట్టుపక్కల వారు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments