Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నార్తుల ఆకలి తీర్చుతున్న నాట్స్, మన్నవ ట్రస్టు: గుంటూరులో 800 మందికి అన్నదానం

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (20:43 IST)
కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో చాలామంది నిరుపేదలకు తిండి దొరకటమే కష్టంగా మారింది. ఈ కష్ట సమయంలో ఆకలితో అలమటిస్తున్న వారిని ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్ట్‌లు ముందుకొచ్చాయి. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు ఆహారపొట్లాలు, నిత్యావసర వస్తువులను అందచేస్తున్నాయి. 
 
ఈ క్రమంలోనే గుంటూరులోని వరలక్ష్మి ఓల్డేజ్ హోమ్, నర్సిరెడ్డి ఒల్డేజ్ హోమ్, విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో నిత్యావసరాలు, ఆహార పొట్లాలను అందించారు. దాదాపు 800 మందికి ఇలా నిత్యావసరాలు, ఆహార పొట్లాలు అందించడం జరిగింది.. ఇంకా అత్యంత నిరుపేదలు ఉన్న ప్రాంతాల్లో తాము నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు సన్నద్ధమవుతున్నామని నాట్స్, మోహనకృష్ణ మన్నవ ట్రస్టులు ప్రకటించాయి. 
గుంటూరులో పేదల పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న నాట్స్ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్‌తో పాటు తన ట్రస్ట్ ద్వారా ఈ నిత్యావసరాల పంపిణీకి పూనుకున్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్నందుకు మోహనకృష్ణ మన్నవను వృద్ధాశ్రమ నిర్వాహకులు వృద్ధులు అభినందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మన్నవ ట్రస్ట్ ప్రతినిధులైన స్వరూప్, సంతోష్, సాయినాథ్, చైతన్య, అంబ్రేష్, చిన్ను, ఈశ్వర్, ఎం. కె., సికెరావు, తేజ, బాజీ, సందీప్, సాయి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments