Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిబంధనలకు తూట్లు : ఏపీ సర్కారుకు రూ.120 కోట్ల అపరాధం

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:35 IST)
పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘించినందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కొరఢా ఝుళిపించింది. ఏకంగా రూ.120 కోట్ల మేరకు అపరాధం విధించింది. 
 
గతంలో పోలవరం పర్యావరణ అంశాలపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు, మాజీ శాసనసభ్యుడు వసంతకుమార్ గతంలో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరిపిన ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ముఖ్యంగా, పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరం, పరిధిలోని పురుషోత్తమ పట్నం, చింతలపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పనులు కొనసాగిస్తున్నందుకుగాను ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసి, భారీ అపరాధం విధించారు. 
 
ఏపీకి విధించిన రూ.120 కోట్ల అపరాధంలో పురుషోత్తంపట్నకు రూ.24.56 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, చింతలపూడికి రూ.73.6 కోట్లు చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
పైగా, ఈ అపరాధాన్ని మూడు నెలల్లోగా కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని  ఆదేశించింది. అలాగే, ఈ అపరాధం నిధుల వినియోగంపై కూడా ఏపీపీసీబీ, సీపీసీబీ సభ్యులతో ఒక కమిటీని నియవించాలని సూచన చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments