Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రాజ్యాంగ దినోత్సవం, అసెంబ్లీ కమిటీ హాల్లో వేడుకలు

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (15:03 IST)
భారత దేశానికి సర్వోత్కృష్ఠమైన‌ చట్టం భారత రాజ్యాంగం. దీని ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, సమాచార వ్యవస్థ ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా రాజ్యాంగం నిర్దేశిస్తోంది. 
 
 
భారత రాజ్యాంగం ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాలలో ఒకటి. అవతారిక, 448 అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన గ్రంథం ఇది. రాజ్యాంగం భారత ప్రభుత్వ వ్యవస్థ, రాష్ట్రాలు, రాష్ట్రాల నిర్మాణం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల విధులు, అధికారాలు, స్థానిక సంస్థలు, ఎన్నికలు మొదలైన విషయాలను నిర్వచించింది. 26 నవంబర్, 1949లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజుకు గుర్తుగా, నేడు రాజ్యాంగ దినోత్సవం, జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం 1950 జనవరి, 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

 
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. అసెంబ్లీ హాలులో  స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్, శాసనమండలి చైర్మన్  మోషన్ రాజు త‌దిత‌రులు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన‌ని జ‌రుపుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments