Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తామని బెదిరిస్తున్నారు : ఎస్పీకి వైకాపా ఎంపీ లేఖ

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (15:26 IST)
వెస్ట్ గోదావరి జిల్లా వైకాపా రాజకీయాల్లో విభేదాలు తారా స్థాయికి చేరాయి. తనను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని, అందువల్ల తన ప్రాణానికి రక్షణ కల్పించాలంటూ జిల్లా ఎస్పీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఇదే జిల్లా వైకాపా రాజకీయాల్లో సంచలనంగా మారింది. 
 
ఇటీవల ఎంపీ రాజు ఏపీ వైకాపా ప్రభుత్వ యేడాది పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫలితంగా ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని, తనను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. 
 
తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించే సమయంలో రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments