Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం : మరో 439 పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఫలితంగా గడచిన 24 గంటల్లో మరో 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో మొత్తం 24451 శాంపిల్స్‌ను పరీక్షించగా ఈ కేసులు బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,059 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 8,929 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 3,599 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 106 కి చేరింది. 
 
రాష్ట్రంలోని 13 జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులను పరిశీలిస్తే, అనంతపురంలో మొత్తం కేసులు 800, చిత్తూరులో 562, ఈస్ట్ గోదావరిలో 555, గుంటూరులో 768, కడపలో 388, కృష్ణలో 1048, కర్నూలులో 1294, నెల్లూరులో 471, ప్రకాశంలో 180, శ్రీకాకుళంలో 59, విశాఖపట్టణంలో 300, విజయనగరంలో 84, వెస్ట్ గోదావరిలో 550 చొప్పున నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో నమోదైన పాజిటివ్ కేసుల సంక్య 1540గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments