Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (08:20 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ "యువగళం" పేరుతో చేపట్టనున్న పాదయాత్ర శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని వరదరాజులు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల తర్వాత ఈ పాదయాత్ర మొదలవుతుంది. తొలి రోజున ఆయన 8.5 కిలోమీటర్ల మేరకు నడువనున్నారు. 
 
ఉదయం 10.15 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభించి, 11.03 గంటలకు ఆయన పాదయాత్రను మొదలుపెడుతారు. మొత్తం 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేరకు ఈ పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు యువగళం పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. 
 
సభ ఆ తర్వాత కుప్పంలోని ప్రభుత్వ ఆస్పత్రి శెట్టిపల్లె క్రాస్ రోడ్డు, బెగ్గినపల్లి క్రాస్ రోడ్డు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. రాత్రి సమయానికి ఆయన బస చేసే ప్రాంతానికి చేరుకుంటారు. ఈ యాత్ర కోసం టీడీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments