Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ.. ఆక్వారంగంపై కన్నేయండి..

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (15:35 IST)
ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ నేత‌ నారా లోకేశ్ లేఖ రాశారు. ఆక్వా రంగం ఎదుర్కొంటోన్న స‌మ‌స్య‌లను ఆ లేఖలో ప్రస్తావించారు. సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని నారా లోకేష్ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డిందని, విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్ర‌క‌టించాల‌ని రైతులు తీసుకున్నార‌ని నారా లోకేష్ తెలిపారు. 
 
ఈ నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌రమ‌ని విమ‌ర్శించారు. ఫీడ్ కేజీకి రూ.20, మిన‌ర‌ల్స్‌, ఇత‌ర మందుల ధ‌ర‌లు 30 శాతం పెరిగినా సీఎం దృష్టికి ఈ స‌మ‌స్య రాక‌పోవ‌డం విచిత్ర‌మేన‌ని ఎద్దేవా చేశారు. 
 
రొయ్య‌ల రేటు ఏ కౌంటు అయినా కేజీ సుమారు రూ.70 నుంచి రూ.150 వ‌ర‌కూ త‌గ్గినా సీఎం నుంచి స్పంద‌న శూన్యమ‌ని విమ‌ర్శించారు. ఆక్వా రంగానికి మేలు చేస్తాన‌ని హామీలు ఇచ్చిన మీరు జ‌గ‌న్.. అధికారంలోకి వ‌చ్చాక ఫీడ్-సీడ్ యాక్ట్ తేవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని నారా లోకేశ్ చెప్పారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి స‌బ్సిడీలు ఎత్తివేయ‌డం ముమ్మాటికీ ఆక్వా రైతుల‌ను ద్రోహం చేయ‌డ‌మేన‌ని అన్నారు. 
 
టీడీపీ గతంలో అన్నిర‌కాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, జ‌గ‌న్ మాత్రం స‌బ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కార‌కుల‌య్యారని ఆయ‌న చెప్పారు. ఆక్వారంగం ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం చూపిన నిర్ల‌క్ష్య వైఖ‌రి కార‌ణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయ‌న అన్నారు.
 
ఇప్ప‌టికైనా క‌ళ్లుతెరిచి ఆక్వా రైతుల డిమాండ్లన్నింటినీ వెంట‌నే నెర‌వేర్చ‌క‌పోతే ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయ‌రంగ దారిలోనే ఆక్వా హాలీడే కూడా త‌ప్ప‌క‌పోవ‌చ్చని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments