Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా నిధుల జమ

Farmers
, మంగళవారం, 14 జూన్ 2022 (09:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు తీపి కబురు చెప్పారు. గత 2021 ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు చెప్పిన మాట ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్‌లోనే రూ.2,977.82 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ బీమా సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. 
 
కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరపున పూర్తి ప్రీమియం చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. సాగు చేసిన ప్రతి ఎకరానికి ఈ-క్రాప్‌లో మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తుంది. 
 
బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనిద్వారా ఉచిత పంటల బీమాను ఒక సీజన్‌ది మరో యేడాది అదే సీజన్ రాకముందే చెల్లిస్తూ వస్తుంది. ఇందులోభాగంగా, ఇపుడు సీఎం ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ భార్యలు ఏడు సెకన్లు కూడా మాకొద్దు.. భార్యాబాధితుల సంఘం