Webdunia - Bharat's app for daily news and videos

Install App

వడ్డీ.. చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం : వైకాపాకు నారా లోకేశ్ హెచ్చరిక

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (20:08 IST)
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార వైకాపా నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. 
 
వాహనాల కొనుగోలు కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో జేసీ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 
 
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. జగన్‌ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు.
 
జేసీ కుటుంబానికి ట్రావెల్స్‌ వ్యాపారం కొత్తకాదని తెలిపారు. 16 నెలలు చిప్పకూడు తిన్న జగన్‌.. ఏపీ ప్రజలందరితో చిప్పకూడు తినిపించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అన్నీ రాసుకుంటున్నాం.. వడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. తొందర్లోనే తిరగబడే రోజు వస్తుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్‌ రెడ్డిపై ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెడుతూ వచ్చారన్నారు. జేసీ ప్రభాకర్‌పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments