Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపోటములు సహజమే... ప్రజల కోసం పని చేస్తాం : నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:35 IST)
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాను పోటీ చేసిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో పాటు.. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"టీడీపీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను" అని చెప్పారు. 
 
"గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీకి, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, సీసీ రోడ్ల నిర్మాణంపై ఓ మహిళ చేసిన ట్వీట్‌కు నారా లోకేశ్ స్పందించారు. "మీ స్పందనకు కృతజ్ఞతలు. మీ గ్రామానికి వేసినట్టుగానే గత ఐదేళ్ళలో ఏపీలో ఏకంగా 25,194 కిలోమీటర్ల మేర కొత్త సీసీ రోడ్లను బాధ్యతగా నిర్మించాం. ఇలాగే ఆయా గ్రామాల ప్రజల కలలు నెరవేర్చాం. ఇది మాకెంతో తృప్తినిచ్చిన అంశం" అని లోకేశ్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments