Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపోటములు సహజమే... ప్రజల కోసం పని చేస్తాం : నారా లోకేశ్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:35 IST)
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. తాను పోటీ చేసిన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో పాటు.. రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"టీడీపీ శాసనసభ అభ్యర్థిగా నేను పోటీచేసిన మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నాను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కావు. ఇకముందు కూడా ప్రజల్లో ఉంటాను. ప్రజల కోసం పనిచేస్తాను" అని చెప్పారు. 
 
"గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా తెదేపా ఎప్పుడూ ప్రజాపక్షమే. ఎన్నికల్లో విజయం సాధించిన నరేంద్ర మోడీకి, వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. 
 
ఇకపోతే, సీసీ రోడ్ల నిర్మాణంపై ఓ మహిళ చేసిన ట్వీట్‌కు నారా లోకేశ్ స్పందించారు. "మీ స్పందనకు కృతజ్ఞతలు. మీ గ్రామానికి వేసినట్టుగానే గత ఐదేళ్ళలో ఏపీలో ఏకంగా 25,194 కిలోమీటర్ల మేర కొత్త సీసీ రోడ్లను బాధ్యతగా నిర్మించాం. ఇలాగే ఆయా గ్రామాల ప్రజల కలలు నెరవేర్చాం. ఇది మాకెంతో తృప్తినిచ్చిన అంశం" అని లోకేశ్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments