Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం... నారా లోకేశ్

Webdunia
శనివారం, 22 ఫిబ్రవరి 2020 (12:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందంద (సిట్)ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పదించారు. మహామేత.. యువనేత.. యువమేత ఆత్రం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'మహామేత', 'యువనేత' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మహామేత అన్న లోకేశ్.. చంద్రబాబుపై ఆ నాటి వైఎస్ ప్రభుత్వం 26కు పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, ఒక సీబీసీఐడీ విచారణ చేయించిందని.. కానీ ఏమైందని ఎద్దేవా చేశారు. 
 
ఇపుడు జగన్ సర్కార్ వచ్చాక.. గత 9 నెలలుగా, మంత్రుల స‌బ్ క‌మిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారని.. ఏమైందని ట్వీట్ చేశారు. 
 
ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని.. అది కూడా హత్య కేసులను విచారణ చెయ్యాల్సిన పోలీసులతో సిట్ వేశారని విమర్శించారు. యువమేత ఆత్రం.. ఇక్కడే అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. సాధించింది, సాధించేది ఏమి లేనప్పుడు సిట్‌లతో కాలక్షేపం చెయ్యడమే పనిగా పెట్టుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments