Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్... నేడు సీఐడీ విచారణకు

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (11:21 IST)
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అవినీతి జరిగిందంటూ అధికార వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారా లోకేశ్ ఏ14గా ఉన్నారు. దీంతో ఆయన వద్ద విచారణ జరిపేందుకు సీఐడీ నిర్ణయించి, నోటీసు జారీచేసింది. తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొంది. మరోవైపు, దీంతో ఆయన సీఐడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 
 
కావాల్సిన వ్యక్తులకు లబ్ధి చేకూర్చడం కోసం రింగ్ రోడ్డు అలైన్మెంట్‌ను ఉద్దేశ్యపూర్వకంగా మార్చారనే అభియోగాలను ఈ కేసులోని నిందితులపై సీఐడీ మోపింది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకే‌శ్‌కు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
అయితే, లోకేశ్‌ను అరెస్టు చేయకూడదని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశారు జారీ చేసింది. విచారణ సమయంలో ఆయన తరపు న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆదేశించింది. దీంతో సీఐడీ అధికారుల ఎదుట లోకేశ్ హాజరుకానున్నారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఆమని నటించిన నారి సినిమా కి 1+1 టికెట్ ఆఫర్

Tamannaah break up:తమన్నా భాటియా, విజయ్ వర్మల డేటింగ్ కు పాకప్ ?

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్త మూల కణ దానంపై అవగాహన కల్పించేందుకు చేతులు కలిపిన DKMS ఇండియా- IIT హైదరాబాద్

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

తర్వాతి కథనం
Show comments